జర్నలిస్టుగా రైతుల కోసం పోరాటం చేస్తే మరియు అవినీతి నీ ప్రశ్నించినందుకు గాను దాడికి పాల్పడిన దురాగతమైన చర్య నల్లబెల్లి మండలంలో

జర్నలిస్టులు అందరికీ మరియు విలేకరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ,వివిధ పార్టీల నాయకులు మరియు మేధావులు మరియు అదే విధంగా సంబంధిత ఆఫీసర్లు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నల్లబెల్లి పీఏసీఎస్ యొక్క 51 ఎంక్వైరీ కోసం ప్రజా మహాజన సభ అని పెడితే అది బోల్లంపల్లి శివారులో గల ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్లో అక్కడికి విచ్చేసిన అసిస్టెంట్ రిజిస్టార్ డి రాజు డిసిఓ ఆఫీస్ వరంగల్ జిల్లా ఆఫీసర్ వచ్చి ఆ మీటింగ్ లో ఉండి వెళ్తుండగా 51 ఎంక్వైరీ ఏం జరిగింది నల్లబెల్లి పిఎసిఎస్ కు సంబంధించి దానిపైన మీయొక్క వివరణ కావాలి అని కోరగా దానిపైన మరియు అదేవిధంగా దీనికి సంబంధించి ఎజెండా అంశం ఏంటి అసలు ఇక్కడ జరిగిన మీటింగ్ పర్యంతమై ఒక రెండు ముక్కలు మీ యొక్క వివరణ ఇవ్వగలరు అని చెప్పి కోరే సమయంలో చెట్టుపల్లి మురళి పిఎసిఎస్ చైర్మన్ గారు వచ్చి నువ్వు ఎవరివి నీకు ఏం సంబంధం నువ్వు ఎందుకు అడుగుతావు నువ్వు ఎందుకు వస్తావు ఇక్కడికి వచ్చే హక్కు నీకు ఎక్కడిది నువ్వు ఎందుకు వచ్చావు అంటూ నానా దుర్భాషలాడుతూ నువ్వు కాంగ్రెస్ పార్టీకి తొత్తువురా నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ దగా చేస్తున్నావ్ అని అంటూ మీది మీదికి వస్తూ వేలెత్తి చూపెడుతూ కళ్ళతో బెదిరిస్తూ తను తనతో పాటుగా తన అనుచరులతో మరియు అదే విధంగా మీదికి వస్తూ ఉండగా నేను జర్నలిస్టుగా ఈ యొక్క పర్యంతమై సంబంధిత మీటింగ్ పై విషయ వివరణ కోరగా వాళ్ళ తమ్ముడు చెట్టుపల్లి దామోదర్ నందిగామ వాస్తవ్యుడు తను నా మీదకు వచ్చి ఛాతి పైన చెయ్యి వేసి నెట్టివేసి నా యొక్క భుజం పైన చేయి వేసి రెండుసార్లు తోసి వేస్తూ మీ అంతు చూస్తాం నీకు ఈ భూమి మీద ఉండాలని ఆశ లేదా నీ సంగతి చెప్తా నువ్వు ఎట్లా ఎట్లా బతుకుతావో చూస్తా పో బిడ్డ అని చెప్పి బెదిరించి వారి అనుచరులతో కలిసి కూడా నాపై దుర్భాషలాడుతూ మీదకు వస్తున్న సందర్భంలో అక్కడున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ మరియు అదే విధంగా హోంగార్డులు వచ్చి మీరు ఆగండి అని చెప్పి ఆపగా నేను అక్కడే నిలబడి కొడితేకొట్టండి రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అసలు రైతులకు రైతాంగానికి సంబంధించిన డబ్బుల గురించి మరియు 51 ఎంక్వైరీ గురించి విషయ వివరణ అడుగుతే నా తప్పేంటి సంబంధిత గవర్నమెంట్ సర్వెంట్ ను ప్రశ్నించడానికి ఒక జర్నలిస్టుగా నాకు అవకాశం లేదా అని చెప్పి నేను అక్కడి నిలబడి ధైర్యంగా నన్ను కొడితే కొట్టండి చంపండి అవినీతి జరిగితే ఊరుకునేది లేదని నిలబడి ఉన్నా నాతోటి సహ జర్నలిస్టులు చూస్తుండగా మరియు అక్కడికి వచ్చిన పబ్లిక్ అంతా కూడా చూస్తూ ఉండగా నేను అక్కడే ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం అనేది నల్లబెల్లి మండల కేంద్రంలో జరిగి ఉన్నది కాబట్టి సంబంధిత జర్నలిస్టులు మరియు విలేకరులు మేధావులు, నాయకులు ప్రజలు అధికారులు అందరు కూడా నాకు సహకరించాలని ధన్యవాదాలు తెలియజేస్తూ.
అవినీతి అన్యాక్రాంతాలపై ప్రశ్నించినందుకు నాకు ప్రాణహాని ఉన్నదని ప్రజాభిముఖంగా పోలీసు వారికి మరియు గౌరవ ప్రజలకు నాయకులకు మేధావులకు అందరి అధికారులకు కూడానేను తెలియజేస్తున్నాన
ఇదే విషయంపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది 
 మీ సునీల్ కుమార్ సామల (జనవాణి టీవీ న్యూస్ రిపోర్టర్)

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post