పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
BLN తెలుగు దినపత్రిక ములుగు : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంకార్యకర్తలు కష్టించి పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. ములుగు మండలంలోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. నేను మంత్రి అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ములుగు నియోజక వర్గంలో సుమారు రూ.30 కోట్ల సీడీఎఫ్ నిధులతో దళిత, గిరిజన వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు మంజూరు చేశామన్నారు. అదే విధంగా ములుగు నూతన బస్ స్టాండ్ ఏటూరు నాగారంలో బస్ డిపోకు నిధులు రూ.80 కోట్లతో టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment