BLN తెలుగు దినపత్రిక వరంగల్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి
అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చైర్పర్సన్ హోదాలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీలతో కలిసి జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఇంటాక్ట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, అటవీ, గిరిజన సంక్షేమ, జి డబ్ల్యూ ఎం సి, శాఖల అధికారులు, చరిత్రకారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటి) ఆదేశాల మేరకు కోట చెరువు శుద్దీకరణకు చేపట్టిన చర్యల గురించి శనివారం కలెక్టర్ ఇరిగేషన్, బల్దియా, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.
Post a Comment