హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన ముదిగొండ సంతోష్ అదే గ్రామానికి చెందిన దానబోయిన సతీష్ ఇరువురికి చెందిన భూమి విషయంలో గత సంవత్సరం నుండి గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో గ్రామంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు.ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్దమనిషి పోల్లెపల్లి శ్రీనివాస్ రెడ్డి, తన అనుచరులు ముదిగొండ సతీష్ పోలీస్ స్టేషన్లోనే దాడికి దిగిన సంఘటనలు ఉన్నాయి.ఇరువురి కి సంబంధించిన పొత్తుల భూమి విషయంలో వ్యవసాయ బావి సంబంధించిన బాట విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయని సంబంధించిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ బాధితులు వాపోతున్నాడు. పొత్తుల వ్యవసాయ బావి నీటిని కేవలం దానబోయిన సతీష్ ఒక్కడే వాడుకుంటున్నాడని అడిగితే బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ చంపుతానంటూ బెదిరిస్తున్నాడని తన వల్ల గ్రామానికి చెందిన పోల్లెపల్లి శ్రీనివాస్ రెడ్డి దానబోయిన సతీష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు పోలీసులు పట్టించుకోని తగు న్యాయం చేసే విధంగా చూడాలని బాధితుడు సంతోష్ తన తండ్రి మల్లయ్య తో తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని ఎలాగైనా పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు
మాకు న్యాయం చేయండి రైతు ఆవేదన
byBLN TELUGU NEWS
-
0
Post a Comment