ములుగు జిల్లా కేంద్రంలో నగరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాగరణ ఉత్సవాల కరపత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సోమవారం రోజున ఆలయ కమిటీ సమావేశానికి సిరికొండ బలరాం హాజరై మాట్లాడారు. ఈనెల 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున శ్రావణ నక్షత్రమున ములుగు లోని శ్రీనగేశ్వర స్వామి దేవాలయం నందు మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలు ఆలయ కమిటి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శివరాత్రి రోజున భక్తులు నిద్రాహారాలు మాని ఆ పరమశివుని భక్తి ప్రవర్తులచే పూజిస్తారని. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. శివాలయంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరమ శివుడికి అభిషేకములు, సాయంత్రం ఏడు గంటల నుండి శివపార్వతుల కళ్యాణం, రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు భజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జాగరణ చేసే భక్తులకు రాత్రి సమయాలలో ఆలయ ప్రాంగణంలో పెండ్యాల జయశ్రీ గారి శిష్య బృందం హనుమకొండ వారిచే కూచిపూడి భరతనాట్య ప్రదర్శన, పొన్నం రాణా ప్రతాప్ భాగ్యనగర్ గారిచే బీట్ బాక్సింగ్ అనుకరణ, శివ రోహిత్ భాగ్యనగర్ గారిచే మిమిక్రీ ప్రదర్శన ప్రత్యేకంగా ఏర్పాటు చేయునట్లు తెలిపారు. మహశివారాత్రి రోజన భక్తులు అదిక సంఖ్యలో పాల్గోని ఆ శివయ్య కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు గాదం కుమార్, కోత్తపెల్లి బాబురావు, గంగిశెట్టి రాజ్ కుమార్, నేరెళ్ల శంకర్, దుడబోయిన రవి, ఓం ప్రకాష్, భూక్య జోహార్, కృష్ణకర్ రావు, రవి రెడ్డి, బల్గూరి నవీన్, సల్పాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
ములుగు : నగరేశ్వర స్వామీ ఆలయంలో ఘణంగా మహ శివరాత్రి వేడుకలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment