మహబూబాబాద్ పట్టణంలోచోరీ...
ఐదు గంటల వ్యవధిలోనే చేదించిన మహబూబాబాద్ టౌన్, సిసిఎస్ పోలీసులు...
ఈ..రోజు (తేదీ23.02.2025,) ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ మార్వాడీబజారులో ఉండే కొండ్లే సాయిప్రసన్న అనే మహిళ రాత్రిపూట గాలి కోసం తన ఇంటి ముందు తలుపులు తీసి మెష్ డోర్ వేసుకొని నిద్రిస్తుండగా..., గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి తన మెడలో ఉన్న బంగారుపుస్తేల తాడు, రూ.5,000/-నగదును అపహరించుకు పోయినారు. టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు ఇవ్వగా, కేసు నమోదు చేసారు. ఆ..కేసును చేదించుటకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు, మహబూబాబాద్ సిసిఎస్ పోలీసులు 4 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. మార్వాడీబజార్ లో ఉన్నటువంటి సిసికెమెరాలను చెక్ చేయగా, అందులో పాత నేరస్తుడు అయిన కోట్ల ముత్యాల్ రావునిన్న రాత్రి ఆ..బజారులో తిరిగినట్టుగా కనబడడంతో ఈ రోజు అతను ఉంటున్న దర్గాతండా కు వెళ్ళిఅతన్ని పట్టుకొన్నారు. ఆయనను విచారించగా మార్వాడీబజారుకు చెందిన కొండ్లే సాయిప్రసన్న ఇంట్లో రాత్రిపూట చేసిన దొంగతనం ఒప్పుకున్నాడు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, పాల్వంచమండలం, వికలాంగులకాలని కి చెందిన కోట్ల ముత్యాల్ రావు దర్గా తండాలో ఉంటూ గత కొంత కాలం నుండి పాల్వంచ, భద్రాద్రికొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం, మహాబుబాబాద్ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినాడు. తరువాత 2024 సంవత్సరంలో కూడా మహబూబాబాద్ పట్టణంలో చోరీ కేసులలో మహబూబాబాద్ టౌన్ పోలీసులు జైలుకు పంపినారు. ఆ..తరువాత జైలు నుండి బయటకు వచ్చి డంపింగ్ యార్డ్ లో పని చేయగా వచ్చే డబ్బులు తన జల్సాలకు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో నిన్న రాత్రి మహబూబాబాద్ పట్టణంలో తిరుగుతూ ముత్యాలమ్మగుడి వద్ద ఒక సైకిల్ కనిపిస్తే దానిని దొంగిలించి,అదే రోజు రాత్రి మార్వాడీబజారులో కొండ్లే సాయిప్రసన్న ఇంట్లో నిద్రిస్తున్న ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును కత్తిరించుకొని ఇంట్లో 5000/- రూపాయలు దొరికితే వాటిని కూడా దొంగిలించుకొని పోయినాడు. వీటి మొత్తంవిలువ సుమారు రూ. 2,12,000/-
నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్, సిసిఎస్ఎస్ఐలు తాహెర్ బాబా, గోపి, టౌన్ ఎస్ఐ లు విజయ్ కుమార్, శివ, క్రైమ్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు.
Post a Comment