తప్పులు చేసే నేరస్తులు ఎవరైనా, పోలీసుల నుండి తప్పించుకోవాలనుకోవడం ఒక భ్రమ అని పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు అన్నారు. శాయంపేట పోలీస్ స్టేషన్ సీఐ చాంబర్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. శాయంపేట మండలంలో యువకులు, రౌడీ షీటర్లు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, కారణాలు లేకుండా వ్యక్తులపై దుర్భాషలాడిన, క్షణికావేశంతో దాడులకు పాల్పడద్దని అన్నారు. దాడులకి పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్యలు ఏర్పడితే, గొడవలకు పాల్పడకుండా, పోలీసులని ఆశ్రయించాలని తెలిపారు. మండలంలో యువకులు ఎలాంటి అల్లర్లకు పాల్పడదని, యువతకి మంచి భవిష్యత్తు ఉందని, ఉన్నతమైన ఆశయాల కోసం, ఒక లక్ష్యం ఎంచుకుని యువత ఎదగాలని సీఐ కోరారు.
తప్పులు చేసే నేరస్తులు ఎవరైనా, పోలీసుల నుండి తప్పించుకోవాలనుకోవడం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment