శాయంపేట : మహిళలు పరిశ్రమలు వ్యాపార రంగాలు ఉన్న వారికి ఎస్బిఐ బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తామని ఎస్బిఐ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయం సమావేశం మందిరంలో పరకాల శాయంపేట నడి కూడా మండలాల ఏపిఎంలకు సీసీలకు వివోఏలకు ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకు లింకేజ్ డిపిఎం దాస్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మా యొక్క ఎస్బిఐ బ్యాంక్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ రుణాలు తీసుకొని ఎలాంటి బకాయి లేకుండా చెల్లించి మరల రుణం పొందగలరని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎస్బిఐ బ్యాంక్ లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా ప్రీమియం చెల్లించి పది లక్షల నుంచి 40 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు అని అన్నారు. మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు తమ వ్యాపారాల అభివృద్ధి కోసం వ్యక్తిగత రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు లింకేజ్ లక్ష్యాలలో 100% టార్గెట్ చేసిన ఉత్తమ ఏపీఎంలకు, సీసీలను, వివో ఏ లను అభినందించి బహుమతులు అందజేశారు. అనంతరం శాయంపేట నుండి మహిళా సంఘాల రుణాలతో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న శాయంపేట మండల కేంద్రానికి చెందిన దాసరి కల్పనను ఆర్ఎం అబ్దుల్ రహీం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజర్లు రాజేష్, శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ అనంత రమణాచారి బ్యాంక్ లింకేజ్ ఏపీఎం రాజు శాయంపేట ఏపీఎం శ్రీధర్ రెడ్డి, పరకాల ఏపిఎం క్రాంతి ,నడికూడ ఏపిఎం రమాదేవి, సీసీలు కేదారి విజయ్ కుమార్ ప్రభాకర్ హేమలత రాజు కుమారస్వామి మూడు మండలాల వివోఏలు పాల్గొన్నారు.
మహిళలకు వ్యక్తిగత రుణాలు అందిస్తాం ఎస్బిఐ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment