అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఎల్లుండి ఖాతాల్లోకి 'పీఎం కిసాన్' డబ్బులు..!

PM-KISAN: అన్నదాతలకు అద్భుతమైన శుభవార్త అందించింది మోడీ సర్కార్. పీఎం కిసాన్ 19వ విడత కింద ఈ నెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. దేశవ్యాప్తంగా 9.7 కోట్లమంది రైతులకు మొత్తం రూ.22 వేల కోట్లను కేంద్రం ఇవ్వనుంది. 2019లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను కేంద్రం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులు రావాలంటే E-KYC తప్పనిసరిగా చేయాలి. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో ఈ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోండి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post