BLN తెలుగు దినపత్రిక:
ఆత్మకూర్ : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడప్పాడు స్టేజి వద్ద సోమవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనబడినట్లు సీఐ సంతోష్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకొని విచారించగా వారు ఒడిశా రాష్ట్రానికి చెందిన కనుసుజాన్, అలోక్ ప్రధాన్, మంగు ప్రధాన్, బ్యాగులో 62 కిలోల గంజాయి లభ్యమైందన్నారు. విలువ సుమారు రూ.31 లక్షలు ఉంటుందన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్ట్ చేశా మన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయి పట్టివేతలో ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment