వేములవాడ రాజన్నను దర్శించుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్సార్..

రాజన్న సిరిసిల్ల జిల్లా/జగిత్యాల జిల్లా, 24 ఫిబ్రవరి 2025:
తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీస్వామి వారిని ఈరోజు సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. రాజన్నను దర్శించుకొనే ముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఆహ్వానం పలికారు. కోడెమొక్కును చెల్లించుకొని అనంతరం స్వామివారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.
కొండగట్టులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే.. 
భక్తుల కొంగు బంగారం.. భక్తులు కోరిన కోర్కెలను తీర్చే జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్నను వేములవాడ రాజన్న దర్శనం అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం పండితులు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే.
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని వేదభూమి అయిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో యమధర్మరాజును దర్శించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ క్షేత్రం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, స్వామి వారి దయ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించానని తెలిపారు. ప్రజా ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post