BLN తెలుగు దినపత్రిక
పరకాల: విద్యార్థులు చదువు మీద దృష్టి సారించాలని ఆర్డీవో నారాయణ అన్నారు.. సోమవారం పరకాల మండల పరిధిలో పదో తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత, వ్యక్తిత్వ వికాసంపై టీజీడబ్ల్యూ ఆరఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పరకాల ఆర్టీవో నారాయణ హాజరై విద్యార్థులకు చదువుపై
అవగాహన కల్పించారు. పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రుల పేరు నిల బెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో రమాదేవి, తహసీల్దార్ విజయలక్ష్మి. ఎంపీడీఓ పెద్ద ఆంజనేయులు, మోటివేటర్ దిలీప్ కుమార్, హెచ్ఎం సీహెచ్ మధు పాల్గొన్నారు.
Post a Comment