ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేయించుకోవాలి ఎస్బిఐ మేనేజర్ రాజేష్

శాయంపేట, BLN తెలుగు దినపత్రిక : భారతీయ స్టేట్ బ్యాంకు కల్పిస్తున్న వ్యక్తిగత ప్రమాద బీమాను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని శాయంపేట భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాజేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంకు వ్యక్తిగత ప్రమాద బీమా ఏడాదికి రూ.2000ల ప్రీమియంతో రూ.40లక్షల ప్రమాద బీమా కల్పిస్తుందని తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంకులో రూ.100కు 2లక్షలు మొదలుకొని గరిష్టంగా రూ. 2వేలకు 40లక్షల బీమా పొందవచ్చని ఈ పథకాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి 18 ఏళ్ల వయస్సు నుంచి 70ఏళ్ల వయస్సు వరకు బీమా చేయించుకోవచ్చని బీమా ప్రీమియం చెల్లించిన వ్యక్తికి రోడ్డు ప్రమాదం, కరెంట్ షాక్, భూకంపం, పాము, తేలు కాటు మరణాలకు వర్తిస్తుందని తెలిపారు.


0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post