మొగుళ్ళ చెరువులో పక్షులను వేటాడుతున్న వ్యక్తులపైచర్యలు తీసుకోవాలని వినతి

శాయంపేట, BLN తెలుగు దినపత్రిక : మండలంలోని పత్తిపాక గ్రామంలోని మొగుళ్ళ చెరువులో పక్షులను వేటాడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా అటవీ శాఖ అధికారికి ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు ఇందారం నాగేశ్వరరావు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైల్లె లైన్ బృందం పత్తిపాక మొగుళ్ళ చెరువును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తిపాక గ్రామంలోని మొగుళ్ళ చెరువులో ఈ నెల 27న కొంత మంది వ్యక్తులు చెరువు విష గుళికలు చల్లి పక్షులను వేటాడారని వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు. తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ కార్యదర్శి చెలుపూరి శ్యామసుందర్ శర్మ, జాయింట్ సెక్రటరీ పిట్టల రవిబాబు, సభ్యులు మారెపల్లి సునీల్ పాల్గొన్నారు.

ఉదయం

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post