తెలంగాణా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల కూడలిలో గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహినిగా సరస్వతి స్రవంతి కలిసే చోటు అత్యంత పవిత్రమైన సంగమమని

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశి, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మే 15 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్ల పనులను సమీక్షించేందుకు శనివారం డా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడారు. పర్వదినాల సందర్భంగా చేసే ఏర్పాట్లలాగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలన్నిటిని అత్యాధునిక వసతులతో కళాత్మకంగా రూపొందిచాలని ఆదేశించారు. సరస్వతి పుష్కరాలు దేశంలో మరెక్కడా జరగవని, కాళేశ్వరం సంగమ స్థలంలో మాత్రమే వందల ఏళ్లుగా నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్లు, స్నాన ఘట్టాల ఆధునీకరణ, పారిశుద్ధ్య పనుల కోసం కేటాయించిన రూ.25 కోట్ల నిధులను సద్వినియోగం చేసి కాళేశ్వరం ప్రతిష్ఠ నలుదిశలా వ్యాపించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. తెలంగాణా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల కూడలిలో గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహినిగా సరస్వతి స్రవంతి కలిసే చోటు అత్యంత పవిత్రమైన సంగమమని ఆయన గుర్తు చేసారు. ‘స్నాన ఘట్టాలను ఆధునికంగా నిర్మాణం చేయాలన్నారు. రోడ్ల పునర్మించడం, విస్తరించడం, మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీము ను ఏర్పాటు చేయాలని సూచించారు. హెలికాప్టర్ జాయ్ రైడ్ల కోసం హెలిపాడ్లకు మరమ్మతులు చేసి మూడు హెలిప్యాడ్స్ సిద్ధం చేయాలని తెలిపారు. ఆలయ పర్యాటక ప్రదేశంగా కాళేశ్వరానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఏడాది పొడవునా భక్తులు వచ్చేలా రాజీ పడకుండా మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. మంచి పేరున్న కన్సల్టెంట్ సంస్థలను నియమించుకునే స్వేచ్ఛ మీకుందని దేవాదాయ, నీటి పారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, రెవిన్యూ, టూరిజం, ట్రాన్స్ కో, ఆర్టీసి అధికారులంతా సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో భాగస్వాములు కావాలని అన్నారు. కాళేశ్వరంలోని ఆర్టీసి బస్ స్టేషన్ ఉన్న ప్రదేశంలో అత్యాధునిక, ఆకర్షణీయమైన మోడల్ బస్ స్టేషన్ తయారు చేయాలని తెలిపారు. అత్యాధునిక వీధి దీపాలు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, వీటి ఏర్పాటు కోసం రూ.62 లక్షల నిధులు ఇప్పటికే విడుదలయ్యాయని తెలిపారు. కొత్త జనరేటర్ లను కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న కుంబాభిషేకం పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని సూచించారు. 
ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ కమిషనర్ ఇ.శ్రీధర్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, ఎస్ ఈ దుర్గాప్రసాద్, టూరిజం ఎండీ ప్రకాశ్ రెడ్డి, ట్రాన్స్ కో ఎస్ ఈ మల్సూర్ నాయక్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇఇ నిర్మల, డిపిఓ నారాయణరావు, ఇరిగేషన్ ఇఇ తిరుపతి, డిపిఆర్వో శీలం శ్రీనివాసరావు, కాళేశ్వరం ఇఓ మారుతి, భూపాలపల్లి ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, డిఎం ఇందు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post