దేశ పౌరులందరికీ పవిత్రమైనది భారత రాజ్యాంగం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబు

హిందువులకు భగవద్గీత, ముస్లీమ్ లకు కురాన్, క్రైస్తవులకు బైబిల్ పవిత్రమైనది అయితే భారతీయ పౌరులందరికీ కుల మతాలకు అతీతంగా రాజ్యాంగం పవిత్రమైనది అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణ బాబు అన్నారు. 76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. క్రీడా పోటీల్లో విజేతలైన కోర్టు సిబ్బంది మరియు న్యాయవాదులకు ప్రధాన న్యాయమూర్తి బహుమతులు ప్రధానం చేసారు. 
ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. జయరాం రెడ్డి , ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. రామచంద్రా రావు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనితావని , అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధక్షులు కూనూరి సురేష్ కుమార్ , ప్రధాన కార్యదర్శి బల్లా మహేందర్ , వైస్ ప్రెసిడెంట్ ఎన్. విష్ణువర్ధన్ రావు , చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మెరుగు రవీందర్ , పి.పి. శ్రీ ఏదులాపురం శ్రీనివాస్ , సీనియర్ న్యాయవాదులు చల్లా మధు , శ్రీనివాస చారి , రఫీక్ , డిప్యూటీ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ , అసిస్టెంట్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ జి. ప్రియాంక , న్యాయవాదులు మంగళంపల్లి రాజుకుమర్, ఇందరపు శివ కుమార్, సంగేమ్ రవీందర్, వేషాల రవీందర్, అశోక్ రెడ్డి, ఎన్. ప్రశాంత్, రజినీకాంత్, కాళిదాస్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post