భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నవ తెలంగాణ రిపోర్టర్ తిలక్ కుటుంబాన్ని పరామర్శించిన

శాయంపేటమండల కేంద్రానికి చెందిన నవ తెలంగాణ రిపోర్టర్ బాల్నే తిలక్ బాబు సోమవారం అర్ధరాత్రి గుండె పోటుతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న భూపాలపల్లి నియోజ కవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బుధవారం సందర్శించి తిలక్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి మనోధర్యంగా ఉండాలని తెలిపారు. తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఆయన వెంట పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, మాజీ ఎంపీపీ చంద్రప్రకాష్, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చిందం రవి, బాసని మార్కండేయ, లక్ష్మీనారాయణ, కొమ్ముల భాస్కర్, నిమ్మల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post