యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

నూతన సంవత్సరం సందర్బంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  కుటుంబసమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరియు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులకు కార్యకర్తలకు, యువతీ, యువకులకు,ఉద్యోగులకు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు.నూతన ఆశయాలు లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అందరూ అడుగుపెట్టాలని వారు ఆకాంక్షించారు.ఆ భగవంతుడు ప్రజలను ఎల్లపుడు క్షేమంగా చూడాలని ఈ నూతన సంవత్సరం ప్రజలందరికి మరిన్ని విజయాలు అందించాలని కోరుకున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post