శాయంపేట మండలకేంద్రంభూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & BRS పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మేడం ఆదేశానుసారం

శాయంపేట మండల కేంద్రానికి చెందిన బాల్నే తిలక్ బాబు (నవతెలంగాణ రిపోర్టర్) ఈ రోజు తెల్లవారు జామున హాట్ స్ట్రోక్ తో  పరమపదించారన్న విషయం తెలుసుకున్న  శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మీ చెరగని చిరునవ్వులతో అందరినీ అప్యాయంగా పలకరించే మహోన్నత వ్యక్తి మీరు, మంచికి మారు పేరుగా నిలచిన మీరు భౌతికంగా మా మధ్య లేరనేది నమ్మలేకున్నాం. మీ తీపి జ్ఞాపకాలతో మా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన, మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాదిత కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకున్నారు. ఇకపై రోజు ఉదయాన్నే మీరు పెట్టే వార్తలు చూడలేమని బాధపడ్డారు
ఈ కార్యక్రమంలో వారి వెంట  మాజీ వైస్ ఎంపీపీ లత-లక్ష్మారెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపెల్లి నందం,బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు మారపెల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదే రాజేందర్, దాసి శ్రావణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సావుల్ల కిష్టయ్య,కరుణ్ బాబు, కుతాటి రమేష్ , రాజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post