BLN తెలుగు దినపత్రిక:
శాయంపేట గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని శాయంపేట పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం మేరకు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో మండలంలోని మాందారి పేట గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు వారిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. వారి నుండి రూపాయలు 8100 మరియు ప్లే కార్డులను స్వాధీనం చేసుకొని శాయంపేట పోలీసులకు అప్పగించారని టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఎస్సై రంజిత్ మరియు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment