డిసెంబర్ 31 వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి, సీఐ రంజిత్ రావు

BLN తెలుగు దినపత్రిక  :
డిసెంబర్31 వేడుకలనుప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ రంజిత్ రావు అన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్లోని తన ఛాంబర్ లో సీఐ విలేకరులతో మాట్లాడుతూ చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలను ఇవ్వవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రిపుల్ రైడింగ్ కు అనుమతి లేదన్నారు. డిసెంబర్ 31 వేడుకలను పురస్కరించుకొని ప్రతి గ్రామంలో పోలీసులతో తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం మత్తులోనే తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ప్రాణ నష్టం వాటిల్లుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండాలని అన్నారు. యువకులు మద్యం సేవించి రోడ్లపై ఉండవద్దని హెచ్చరించారు. మద్యం సేవించి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post