గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు


 *అల్లుఅర్జున్ వివాదంపై పవన్* 
అల్లు అర్జున్​ వివాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని అన్నారు. *తెలంగాణ ఫిల్మ్​ డెవలప్​మెంట్​ ఛైర్మన్​ దిల్​రాజు పవన్​ కల్యాణ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.* ఈ సందర్భంగా పవన్​ కల్యాణ్​ మాట్లాడారు. *తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని* పవన్​ కల్యాణ్ అన్నారు. *ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగారని* అన్నారు. వైఎస్సార్​సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని పవన్ అభిప్రాయపడ్డారు. *తెలంగాణలో బెనిఫిట్​ షోలకు రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని* గుర్తు చేశారు. *టికెట్​ ధరలు పెంపునకు కూడా అవకాశం కల్పించారని* పవన్​ కల్యాణ్​ అన్నారు. *అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని* పవన్​ అభిప్రాయపడ్డారు. *అల్లు అర్జున్​ కాకున్నా కనీసం నిర్మాతలైనా* వెళ్లి ఉండాల్సిందన్నారు.

 *అందరూ రేవతి ఇంటికి వెళ్లి పరామర్శించి ఉండాల్సింది :* అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్​ కల్యాణ్​ అన్నారు. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. *పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని* తెలిపారు. పుష్ప సినిమాకు సీఎం రేవంత్‌ రెడ్డి సహకరించారన్నారు. పుష్ప టిక్కెట్‌ రేట్లు పెంచారని, బెనిఫిట్‌ షోకు అవకాశమిచ్చారని గుర్తు చేశారు. సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి స్పందించారని పవన్​ కల్యాణ్​ తెలిపారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. *రేవంత్‌ చాలా డైనమిక్ లీడర్​ అన్న ఆయన, తెలంగాణ సీఎం సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయని గుర్తు చేశారు.* ఇదే సమయంలో *తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేదని* పవన్​ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post