*అల్లుఅర్జున్ వివాదంపై పవన్*
అల్లు అర్జున్ వివాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని అన్నారు. *తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్ దిల్రాజు పవన్ కల్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.* ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. *తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని* పవన్ కల్యాణ్ అన్నారు. *ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగారని* అన్నారు. వైఎస్సార్సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని పవన్ అభిప్రాయపడ్డారు. *తెలంగాణలో బెనిఫిట్ షోలకు రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని* గుర్తు చేశారు. *టికెట్ ధరలు పెంపునకు కూడా అవకాశం కల్పించారని* పవన్ కల్యాణ్ అన్నారు. *అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని* పవన్ అభిప్రాయపడ్డారు. *అల్లు అర్జున్ కాకున్నా కనీసం నిర్మాతలైనా* వెళ్లి ఉండాల్సిందన్నారు.
*అందరూ రేవతి ఇంటికి వెళ్లి పరామర్శించి ఉండాల్సింది :* అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ కల్యాణ్ అన్నారు. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. *పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని* తెలిపారు. పుష్ప సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి సహకరించారన్నారు. పుష్ప టిక్కెట్ రేట్లు పెంచారని, బెనిఫిట్ షోకు అవకాశమిచ్చారని గుర్తు చేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. *రేవంత్ చాలా డైనమిక్ లీడర్ అన్న ఆయన, తెలంగాణ సీఎం సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయని గుర్తు చేశారు.* ఇదే సమయంలో *తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్గా వెళ్లి ఉంటే బాగుండేదని* పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
Post a Comment