జర్నలిస్టు తిలక్ అన్న మృతి శాయంపేట మండల ప్రజలకు తీరని లోటు

శాయంపేట మండలం* 
నవ తెలంగాణ సీనియర్ జర్నలిస్టు తిలక్ అన్న మృతి శాంపేట మండల ప్రజలకు తీరనిలోటు అని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు మంగళవారం రోజున మండల కేంద్రంలో వారి నివాసంలో వారి యొక్క మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తిలక్ అన్నగారు గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరమన్నారు కొన్ని సంవత్సరాల నుండి జర్నలిస్టు వృత్తిలో పనిచేస్తూ జర్నలిస్టు అనే పదానికి గౌరవం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి తిలక్ అన్న గారు అని అన్నారు శాంపేట మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం వార్త రాస్తూ ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి చేరవేసి వారి యొక్క సమస్యలను పరిష్కరించేవారన్నారు ఇలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఇస్మాయిల్ సిద్ధార్థ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post