ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలన్నారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా మరోసారి రాష్ట్ర, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post