కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

నడికూడ మండలం చర్లపల్లి లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకుముందు గ్రామంలో ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కలిసి రాగి జావ త్రాగారు. పాఠశాలలోని వంటగది, లైబ్రరీ,తరగతి గదులు,స్కూల్ బ్యాంక్ ఆఫ్ చర్లపల్లి లను ఎమ్మెల్యే పరిశీలించారు. అంగన్వాడి కేంద్రం సమీపంలో కమ్యూనిటీ కిచెన్ విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారుకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post