శాయంపేట మండల ప్రజలం దరూ నూతన సంవత్సర వేడుకలను నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్సె పరమేశ్వర్

BLN తెలుగు దినపత్రిక 
 శాయంపేటమండల ప్రజలం దరూ నూతన సంవత్సర వేడుకలను నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్సె పరమేశ్వర్ తెలియజేయడం జరిగింది. మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మద్యం తాగి వాహనాలు నడపరాదని, 31 రాత్రి గుంపులు గుంపులుగా తిరగరాదని అన్నారు. ఎటు వంటి ఎంటర్టెన్మెంట్ కార్యక్ర మాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు.కేక్ కట్ చేయాలి అనుకునే వారు తమ తమ ఇళ్ళలోనే చేసుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ఎటువంటి గొడవలను తావివ్వకుండా ప్రజలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకోవాలని ఎస్సె ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం " కల్పించకుండా నూతన సంవత్సరానికి స్వాగత వేడుకలు ప్రశాంత వాతావ రణంలో జరుపుకోవాలని హితవుపలికారు. సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శృతిమించకుండా పోలీసుల సూచనలు తప్పకుండా పాటించ వలసిందిగా సూచించారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు అసౌక ర్యం ఇబ్బంది కలిగించరాదని తెలిపారు. ఎవరైనా శృతి మించి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే, వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని హెచ్చరిం చారు. మైనర్లు మోటార్ సైకిల్ (ద్విచక్ర వాహనాలు) నడుపు తూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్ సైకిల్నడుపు తూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్ సైకిల్ యజమానిపై,తల్లిదండ్రు లపై చర్యలు తీసుకోబడు తుందని హెచ్చరించారు.


0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post