ములుగు జిల్లా: ములుగు జిల్లాలో ల్యాండ్మైన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వెంకటాపురం మండలం నూగూరు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు ల్యాండ్మైన్ పేలుడులో మృతి చెందినట్లు సమాచారం.స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ పరిసర ప్రాంతాల్లో గతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు కారణమైన మందుపాతర ఎప్పుడు, ఎవరి ద్వారా అమర్చబడింది అనే అంశాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.అటవీ ప్రాంతాల్లో గతంలో అమర్చిన మందుపాతరలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారుఈ ఘటనతో నూగూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ల్యాండ్మైన్ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
ల్యాండ్మైన్ పేలి వ్యక్తి మృతినూగూరు గ్రామంలో విషాదం.. గతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరగా అనుమానం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment