మాందారిపేట కస్తూర్బా పాఠశాలలో అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన

శాయంపేట, జూన్ 15:
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం శాయంపేట మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని మాందారిపేట గ్రామంలో ఉన్న కస్తూర్బా గురుకుల బాలికల విద్యాలయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులక  శంకుస్థాపన చేయనున్నారు.
పాఠశాలలో విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు విద్యా రంగానికి మరింత ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు,  ప్రతినిధులు హాజరుకానున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post