గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం గట్ల కనపర్తి గ్రామసభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట, జూన్ 4: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం శాయంపేట మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామసభల ప్రధాన ఉద్దేశ్యం గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమేనని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు సంక్షేమ పథకాలు సహా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయో లేదో గ్రామస్థులు పరిశీలించాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచే సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post