శాయంపేట మండల కేంద్రంలో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఆధ్వర్యంలో డ్రైనేజ్ శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఎక్కడైనా నీరు నిల్వ ఉండకుండా, దుర్వాసన మరియు వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు పరిశుభ్రతను కాపాడుకోవడంలో సహకరించాలని కోరారు. డ్రైనేజ్లలో చెత్త వేయకుండా గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని డ్రైనేజ్లను శుభ్రం చేశారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సర్పంచ్ తెలిపారు.
Post a Comment