మేడారం : సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం మేడారం వచ్చిన భక్తులలో ఒకరు జంపన్న వాగులో ప్రాణాలుకోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన కిరణ్ (45) అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమ్మవార్ల దర్శనానికి మేడారం వచ్చాడు. పుణ్యస్నానం ఆచరించేందుకు వాగులోకి దిగిన ఓ భక్తుడు ప్రవాహ ధాటికి కొట్టుకుపోయి మృతి చెందాడు. జాతర సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, సదరు వ్యక్తి స్నానం కోసం జంపన్న వాగులోకి దిగాడు. అయితే నీటి ఉధృతిని గమనించకపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన తోటి భక్తులు, రక్షణ సిబ్బంది అప్రమత్తమైనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట లోతులోకి వెళ్లవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షణ ప్రాంతాల్లోనే స్నానాలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కళ్లముందే జరిగిన ఘటనతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల భక్తులు షాక్ నకు గురయ్యారు. ఈ ఘటనతో జాతర ప్రాంగణంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
మేడారంలో విషాదంజంపన్న వాగులో కొట్టుకుపోయి ఒకరి మృతి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment