గణేశ్ నిమజ్జనంలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం 1:10కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నాం 2 నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో భేటీకానున్నారు. రాష్ర్టంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 3 నుంచి 3:30 వరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణంపై ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర హోంమంత్రి ప్రారంభించి.. కమిటీ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగనున్నారు. 3:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్ఎస్బీ 28వ బెటాలియన్ హెడ్క్వార్టర్స్కి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఐటీసీ కాకతీయ నుంచి సాయంత్రం 4 గంటలకు మెజాంజాహీ మార్కెట్ వినాయక చౌక్కు చేరుకుని గణనాథులకు స్వాగతం పలకడంతో పాటు గణేష్ శోభాయాత్రను ఉద్దేశించి ప్రసంగిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి.
Post a Comment