ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాయంపేట మండలంలోపత్తిపాక కాంప్లెక్స్ మీటింగుకు హాజరై ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష గుణాత్మక విద్య కోఆర్డినేటర్ డాక్టర్ బి మన్మోహన్, శాయంపేట మండల విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు అనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఆర్ పి లు అంజని, నారాయణ, అశోక్, మనోజ్, సురేందర్ మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే-డి. ఇ. ఓ. వాసంతి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment