శాయంపేట మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం

తెలంగాణలో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి అర్హులైన వారందరికీ జియో టాగ్ తో సంబంధం లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని శాయంపేట మండల కేంద్రంలో విలేకరులతో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ
ఉమ్మడిరాష్ట్రంలో 1500 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నదని ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని అన్నారు
చేనేత మరియు పవర్ లూమ్స్ కార్మికులకు సరిపడా పని లేక పని భద్రత లేని కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ప్రభుత్వం తక్షణమే ఆత్మహత్యల నివారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు అర్హులైన వారందరికీ ఐదు వేల రూపాయల ఆసరా ఇవ్వాలని అన్నారు
చేనేత కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు ఆసరా పింఛన్ ఇవ్వవలసి ఉండగా గత ప్రభుత్వము ఇవ్వలేదు నేటి ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతున్నారని
మరణించి పెండింగ్ లో ఉన్న చేనేత కార్మికుల స్థానంలో వారి భార్యలకు ఆసరా పింఛను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్యప్రధాన కార్యదర్శి సామల ధనుంజయ్
జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ ‌ జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ
పద్మశాలి మండల మహిళా అధ్యక్షురాలు బాసని శాంత
మండల నాయకులు
చిందం రవి, భాషని మల్లికార్జున్ , దిడ్డి ప్రభాకర్,
ముదిగొండ సంతోష్, మోత్కూరి సత్యనారాయణ
కొండ ముకుందం , వనం దేవరాజు, కోమటి శేఖర్, దాసరి రవి, రంగు మహేందర్, గొట్టిముక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post