పార్టీ నుండి సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రేగొండ మండల జర్నలిస్టుల డిమాండ్

ములుగు జిల్లా: తాడ్వాయి లో జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేగొండ మండల జర్నలిస్టుల ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జర్నలిస్టు పై దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలో జర్నలిస్టులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి చేసిన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పై దాడి చెస్తే ఇక పై సహించేది లేదని అన్నారు. వారి పై కఠిన చర్యలు తీసుకునే వరకు జర్నలిస్టుల పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ ధర్నాలో మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post