75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఆదివాసి బిడ్డకు మంత్రి పదవి దక్కితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.నా పర్శనాలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మావోయిస్టుల లేఖా..? లేక నేనంటే గిట్టని వాళ్లు కుట్ర పూరితంగా సృష్టించిన లేఖా..? అనేది తేలాల్సి ఉంది. ఆ లేఖను ముందుపెట్టి కొందరు నాపై రాజకీయ కక్షను వెళ్లగక్కుతున్నారు. నన్ను ఓడించాలని నాడు వంద కోట్ల వరకు పెట్టారు. నాకు మంత్రి పదవి వచ్చినప్పటినుండి ఎప్పుడు దించాలి అని చూస్తున్నారు. GO 48ను రద్దు చేయాలని తీర్మానం చేశాం. ప్రతిపక్షంలో పోరాటం.. అధికారంలో సమస్యల పరిష్కారమే నా బాధ్యత.నేను ఒక మహిళను అని కూడా చూడకుండా బాధాకరంగా ప్రచారాలు చేస్తున్నారు. అట్టడుగు వర్గాల కోసమే నా పోరాటం.. ఆరాటం. గత ప్రభుత్వంలో చెట్లకు కట్టేసి కొట్టారు. ఆదివాసి బిడ్డను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా.. ఆదివాసీలకు ఎందుకు భూమి ఇవ్వలేదు. అని మంత్రి సీతక్క అన్నారు.
నాపై మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ బాధాకరం.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment