తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరించారు..!!

ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా..మంత్రి సీతక్క స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మావోయిస్టులు వివరించారు.ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా...? అంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా.. మాజీ మావోయిస్టు సీతక్క ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జీవో నెంబర్. 49తో కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని* ఆరోపించారు.ఈ 49 జీవో కారణంగా రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగవుతున్నాయని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టెందుకే జీవో నెం. 49 తీసుకువచ్చారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వారు నిప్పులు చెరిగారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు *మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post