సేంద్రీయ పద్ధతిలో సహజసిద్ధమైన వ్యవసాయం చెయాలి. వ్యవసాయ అధికారి గంగా జమున

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో సూరంపేట గ్రామంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది అనంతరం రైతులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత వానాకాలంలో విత్తనాలు ఎరువులు పురుగుమందులు మరియు నీటి యాజమాన్యం తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా సూచించడమైనది, అధిక రసాయనాలు వాడడం వల్ల నేల నీరు గాలి కాలుష్యం తో పాటు మానవుని యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది కనుక అధిక రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రీయ పద్ధతిలో సహజసిద్ధమైన వ్యవసాయం చేసినట్లయితే ఆరోగ్యకరమైన పంటను మనము తీసుకోవడానికి వీలవుతుంది, అధిక రసాయనాలు వాడడం ద్వారా నేలలో చౌడు వచ్చే అవకాశం కూడా ఉన్నందున రసాయనలకు బదులుగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోగనుక మనం వ్యవసాయాన్ని కొనసాగించినట్లయితే కొంతకాలానికి చౌడు దానంతట అదే తగ్గిపోయే అవకాశం కూడా ఉంది, బలమైన నేలలున్న దగ్గర పంట కూడా బలంగానే ఉంటుంది, అందువల్ల బలమైన మొక్కలు ఉండే అవకాశం ఉంది కనుక నాణ్యమైన దిగుబడిని సాధించే అవకాశం ఉందని సూచించడం జరిగింది, పురుగుమందుల పిచికారి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది. పురుగుమందులు కూడా సిఫారసు మేరకే వాడాలని సూచించడం జరిగింది. బయోమందులను ఎట్టి పరిస్థితులలో వాడరాదని తెలియజేయడం జరిగింది. బయోమందులు వాడడం ద్వారా తాత్కాలికంగా మొక్క ఎదుగుదల కనపడినప్పటికిని తదుపరి పరిణామాలలో పురుగు ఉధృతి మరి ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి పంటను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి బయో మందులను రైతులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదని సూచించడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులు మొక్కజొన్న మరియు వరి మేల్ ఫిమేల్ పద్ధతిలో పంట పండించడం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. సదరు కంపనీ దగ్గర తప్పనిసరిగా ప్రాపర్ అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి. అలాంటి పరిస్థితులలో పొరపాటున ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు లేదా దిగుబడులు తగ్గడం జరిగినప్పుడు కంపెనీవారి నుండి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందిగనుక అగ్రిమెంటు తప్పనిసరిగా తీసుకోవాలి, డీలర్ల దగ్గర కూడా కచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరనే విత్తనాలు కొనుగోలు చేయాలి, రసీదులను పట్టకాలమంతా కూడా భద్రపరచాలి, మరియు తప్పనిసరిగా రైతు తీసుకునే రసీదు మీద షాపు యజమాని సంతకం తో పాటు రైతు సంతకం కూడా ఉండేలాగా చూసుకోవాలి. తీసుకున్న రసీదులో విత్తనాలు ఎరువుల లేదా పురుగుమందుల పూర్తిస్థాయి సమాచారం ఉండేలాగా చూసుకోవాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి, తద్వారా భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా మనము ఎరువులు వేసుకోవడానికి అవకాశం ఉంది గనుక రైతులు ఈ దిశగా దృష్టి సారించాలని సూచించడం జరిగింది. 
అనంతరం ప్రజ్వల్ సంస్థ వారు రైతుల కోసం తయారుచేసిన నవధాన్యాల మినీ కిట్స్ రైతులకు పంపిణీ చేయడం జరిగింది, నవధాన్యాల ద్వారా కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది.
ఇందులో పంచాయితీ సెక్రటరీ రాజ్ కుమార్, ప్రజ్వల్ సంస్థ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కల్పన మరియు రైతులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post