జయశంకర్ భూపాలపల్లి పుష్కరాల సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం లో 3 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. అందులో 2 తప్పిపోయిన శిబిరాలు మరియు ఒక క్రచ్ కేంద్రం జిల్లా సంక్షేమ అధికారి జి. మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది, 12 రోజుల పాటు 24/7 ఈ శిబిరాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది
1620 మంది గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం
8560 మంది చిన్నారులకు బాలామృతం
6840 మంది పిల్లలకు కురుకురే ప్యాకెట్లు
పంపిణీ చేయడం జరిగింది.
అంతేకాక, పుష్కరాల సందర్భంలో తప్పిపోయిన 1120 మంది వ్యక్తులను వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించడం జరిగింది అని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి తెలియచేశారు
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన మహాదేవపూర్ CDPO రాధిక గారికి, సూపర్ వైజర్లు ,మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలియచేశారు
జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
Post a Comment