భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు నేడు శాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఇన్చార్జిలు కొమ్ముల భాస్కర్ మామిడిపల్లి సాంబయ్య తో పాటు పరకాల AMC వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ బుజ్జన్న సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కమిటీలో అధ్యక్షునిగా మారపల్లి రాజు (వరదరాజు) ప్రధాన కార్యదర్శిగా మామిడి సుదర్శన్ ఉపాధ్యక్షులుగా కోల శ్రీనివాస్ బాసని చంద్రమౌళి కార్యదర్శులుగా బేర్గు సతీష్ బొల్లెపల్లి సదానందం కోశాధికారిగా అల్లే శంకర్ ప్రచార కార్యదర్శిగా వలుపదాసు వెంకటరమణ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా
శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా వలుపదాసు శ్వేత ఉపాధ్యక్షురాలుగా మారేపల్లి జ్యోతి ప్రధాన కార్యదర్శిగా మారేపల్లి కళ్యాణి కార్యదర్శులుగా ఎండి జేబున్ ప్రచార కార్యదర్శిగా రంగు సరస్వతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Post a Comment