సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు

శాయంపేట మండలంలో కొత్తగట్టు సింగారం గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రైతులకు రాబోయే వానాకాలం మరియు యాసంగి లో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు కొన్ని సూచనలు చేశారు.పంట మార్పిడి ద్వారా వివిధ రకాల తెగుళ్లను అరికట్టవచ్చని తెలిపారు సేంద్రియ వ్యవసాయం మరియు దాని వల్ల ఉపయోగాలు వివరించారు, ఎరువులు మరియు నీటి యాజమాన్యం గురించి వివరించారు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ గొర్రెల పెంపకం మరియు కోడి పరిశ్రమ యొక్క ఉపయోగాలు తెలిపారు, రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం ద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు, విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని సూచించారు, విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు, సమీకృత వ్యవసాయ విధానం పాటించినట్లయితే సంవత్సరం పొడవునా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు, వేసవిలో లోతు దుక్కులు దున్నడం ద్వారా భూమిలో ఉన్నటువంటి హానికర పురుగుల గుడ్లను నిర్మూలం చేయవచ్చని తెలిపారు, డ్రిప్పు పద్ధతిలో నీటి యాజమాన్యం పాటించినట్లయితే నీటి వృధాని అరికట్టవచ్చు అని చెప్పారు, పత్తి మొక్కజొన్న మరియు మిర్చి పంటలపై ఆశించే వివిధ రకాల చీడపీడలు మరియు వాటి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్య్రమంలో డాక్టర్ జె సాయికిరణ్ వెటర్నరీ సైంటిస్ట్ కెవికె మామునూర్ మరియు డాక్టర్ ఎం సురేష్, ప్రధాన శాస్త్రవేత్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ హైదరాబాద్, N.సాయి చంద్ యంగ్ ప్రొఫెషనల్, మరియు రైతులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post