పరకాల బస్టాండ్ ఆవరణలో మజ్జిగ పంపిణీ...

పరకాల పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో అక్షయ తృతీయ పర్వదినంను పురస్కరించుకొని పరకాల అరుణ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ & సీడ్స్ ,సంజయ్ మెడికల్స్ స్టోర్స్ ,గంగా వాటర్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఎండాకాలం వేసవి తాపం నుండి ప్రజలకు ప్రయాణికులకు దాహార్తిని తీర్చే సదుద్దేశంతో పరకాల బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పరకాల కుంకుమేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు చేతులమీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గందె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... వేసవికాలం ప్రారంభం నుండి బస్టాండ్ ప్రాంగణంలో బస్టాండ్ ఆవరణలో అరుణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ & సీడ్స్, సంజయ్ మెడికల్స్ స్టోర్స్ ,గంగా వాటర్ ప్లాంట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని నీటిని ఉచితంగా ప్రయాణికులకు ప్రజలకు అందిస్తూ సేవ చేస్తున్న నేపథ్యంలో నేడు అక్షయ తృతీయ పర్వదినం అనగా పవిత్ర గంగానది భూమినీ తాకిన పర్వదినంగాను, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజుగా, వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలు పెట్టిన పర్వదినంగా కొనియాడే రోజు పాండవులకు సూర్య భగవానుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు ఇంతటి పవిత్రమైన రోజున ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ చలివేంద్రమును ఎండాకాలం పూర్తి వరకు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రవిచంద్ర మరియు ఆర్టీసీ సిబ్భంది ,ప్రయాణికులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post