పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ పాదయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. రెడ్డీ కాలనీ నుండి పాదయాత్ర ప్రారంభమైంది.కార్యకర్తలు బాణసంచా కాల్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా మన్నారు. పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటంలేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు .రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ,పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్ల మెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు.అమిత్ షా అంబేడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించార న్నారు.గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.ఈ యాత్రలో జై బాపు, జై భీమ్, జై సంవీధాన్ మండల ఇన్చార్జి ప్రణయ్ దీప్. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు దూదిపాలబుచ్చిరెడ్డి, పత్తిపాక గ్రామ వైద్యుల వెంకటరాజు రెడ్డి , జంగారెడ్డి, చిట్టి రెడ్డి రాజి రెడ్డి,బాసని చంద్రప్రకాష్, దుబాసి కృష్ణమూర్తి, బాసని శాంత- రవి, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, అబ్బు ప్రకాష్ రెడ్డి, చక్రపాణి, చిరంజీవి, భాస్కర్ , అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment