పల్లెల్లో మత్తు వాసన ఆగం మవుతున్న యువత

వరంగల్ గౌడ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు పైడిమల్ల రాజేష్ గౌడ్
బి ఎల్ ఎన్ తెలుగు దినపత్రిక: నల్లబెల్లి 
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కలలను కలలుగానే మిగిలిస్తున్నారు.యువత ముఖ్యంగా పాఠశాల మానేసిన పిల్లలు మత్తు కు బానిస అవుతున్నారు.గంజాయి తో యువత బానిసలు అవుతున్నారు. గంజాయి సేవించే వారిలో ఎక్కువగా 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారు కావడం విశేషం. చిన్న వయసులోనే గంజాయి కి అలవాటు పడి తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. గంజాయి అమ్మకాలు, కొనుగోలు నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా మార్చుకున్నారు. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం నిర్మానుష్య ప్రదేశాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు నిర్మానుష్య ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, తల్లిదండ్రులు వారి పిల్లల కార్యకలాపాలు ఏం చేస్తున్నారు చూడాలి అని రాజేష్ గౌడ్ కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post