ఈనెల 16న ముఖ్యమంత్రి పర్యటనను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
నియోజకవర్గానికి మొదటిసారిగా వస్తున్న ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలకాలి800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎంఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఏ నియోజకవర్గానికి మంజూరు కాలేదుఅధికారులందరూ సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా పనిచేయాలి
రేపటి నుండి పాయా శాఖలో అధికారులందరూ ఫీల్డ్ మీద ఉండాలి40 వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు
సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలిఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు రాకూడదు
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అధికారులందరూ సహకరించాలిముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.ఈ నెల 16న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనమ్మ అభివృద్ధి పనులకు సంబంధించిన ఏర్పాట్లను జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన భవన రూపకల్పన, రోడ్లు, పార్కింగ్, డ్రైనేజీ, మార్చురీ ఏర్పాటు వంటి పనులపై అధికారులతో చర్చించి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం పల్లగుట్ట క్రాస్ రోడ్ లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల నందు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించారు. తదనంతరం నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా కలెక్టర్ అడిషనల్ డిజిటల్ కలెక్టర్ ఆర్టీవోలు పోలీస్ ఉన్నతాధికారులు వివిధ శాఖలకు సంబంధించిన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేషన్గనుకు నియోజకవర్గం లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని తెలిపారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి, ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి, గణపూర్ నుండి నవాబ్ పేట మెయిన్ కెనాల్ సిసి లైనింగ్ నిర్మాణానికి, ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఆఫీసు నిర్మాణానికి, రాయగూడెం సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం మరియు సాగరం పుర్చపల్లి కొండపూర్ పతే షాపూర్ సబ్ స్టేషన్ లకు, పంచాయతీరాజ్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రోడ్లు, బంజారా భవన్, ఆయిల్ సీడ్ సేకరణ కేంద్రం శంకుస్థాపన చేయడంతో పాటు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను, అనుమతులను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పూర్తి చేసి శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment