ముస్లింలకు రంజాన్ పవిత్రమైనది
శాయంపేట మండలం కేంద్రంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.క్రమశిక్షణ, దాతృ త్వం, ధార్మికచింతనల కల యికే రంజాన్ మాసం. ముస్లిం లు చంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు ఈ రంజాన్ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్రాయబడిం ది.కావున రంజాన్ మాసం ఎంతో పవిత్ర మైనదిగా భావిస్తారు.ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధల తో పవిత్రంగా రోజా ఉంటూ ఉంటారు. రోజా ఉన్న ముస్లిం లు రంజాన్ మాసంలో అత్యం త నీతి నియమాలతో నిష్టతో కూడిన ఉపవాస దీక్షలో ఉండి అల్లాను ఆరాధిస్తారు రంజాన్ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉండి ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుం టారు.పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతను, మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్నా యి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించిన దైన సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని, పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవా ళికి అందిస్తుంది.ఈ కార్యక్రమంలో బాసని మార్కండేయ, రఫీ, చింతల రవిపాల్ , రాజు, కట్ట్టయ్య చిరంజీవి కార్మికుల మండల అధ్యక్షుడు రాజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకు లు, ముస్లిం సోదరులు, పిల్లలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
Post a Comment