హైదరాబాద్: ప్రజాభవన్లో రేపు ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఈ భేటీలో చర్చించను న్నారు. ఎంపీల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రంలోని అందరు ఎంపీలకు భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వా నించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసి ముసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్ తదితర అంశాలపై విన్నవించారు. నిధులు, అను మతుల కోసం ప్రధాని, మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సరైన స్పందన రావడం లేదని ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీంతో పెండింగ్ ప్రాజె క్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభవన్ లో శనివారం అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
రేపు అఖిలపక్ష భేటీప్రజాభవన్ లో .కీలక సమావేశంబండి సంజయ్, కిషన్ రెడ్డికి.భట్టి ఫోన్..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment