తెలంగాణ ప్రాంత హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దిడ్డి రమేష్

నియామక పత్రం అందజేసిన పద్మశాలి సంఘ పెద్దలుకుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ


తెలంగాణ ప్రాంత హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గా దిడ్డి రమేష్ ను నియమిస్తూ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు బచ్చు ఆనందం, ఆడెపు రవీందర్ లు నియామక పత్రం అందజేశారు. మంగళవారం వరంగల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దిడ్డి రమేష్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించామని, పద్మశాలి సంఘంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉత్సాహంగా పనిచేస్తూ, కులాభివృద్ధికి పాటుపడుతున్నందుకు సేవలను గుర్తించి నియమించినట్లు పద్మశాలి సంఘ పెద్దలు తెలిపారు. నా నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు అభినందనలు తెలిపిన రమేష్ సంఘ కార్యక్రమాలకు, పద్మశాలి కులాభివృద్ధికి నా వంతు సహకారాన్ని అందిస్తూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, పసునూటి బిక్షపతి పాల్గొన్నారు

.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post