ఎస్సారెస్సీ కెనాల్లో పడిన కారు

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30)తోపాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు చిన్నారి సాయివర్దన్ (2) మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వరంగల్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కెనాల్లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. దీంతో ప్రవీణ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్య కృష్ణవేణిని కాపాడారు. అప్పటికే బాలుడు సాయివర్దన్ మరణించాడు.
ప్రవీణ్, ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా
నీటిలో గల్లంతయ్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కుచెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లోపడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయినతండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం.సోమారపు ప్రవీణ్ ఎన్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అనితెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివిధరాజకీయ పార్టీల నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించిపరిస్థితిని సమీక్షిస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post