హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి

BLN తెలుగు దినపత్రిక  మంగపేట: మేడారం మినీ జాతరకు వచ్చే భక్తులు తిరుగు

ప్రయాణంలో హేమాచల లక్ష్మీనృసింహుని దర్శించుకుంటుం డడంతో భక్తుల రద్దీ పెరిగింది. శనివారంతో మినీ మేడారం ముగియడంతో సమ్మక్క- సారలమ్మలను దర్శించుకుని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణకు బార్డర్లో ఉండే భక్తులు ఇళ్లకు తిరిగివెళ్లే క్రమంలో నృసింహుని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలో శనివా రం ఆలయ దర్శనంలో వేలాదిగా భక్తులు నృసింహుని దర్శిం చుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, అర్చకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనున్నట్లు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post